అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నటి నికిత

-

ఒడిశాకు చెందిన టీవీ నటి నికిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెకు లక్ష్మీప్రియ అనే పేరు కూడా ఉంది. ఒడిశాలోని కటక్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. నికితకు పెళ్లయింది. ఆరు నెలల పాప ఉంది. భర్తతో కలిసి కటక్‌లో నివాసముంటోంది. తన ఇంట్లో గాయాలతో పడి ఉన్న నికితను గమనించిన నికిత తండ్రి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే.. ఆమె టెర్రస్ నుంచి కింద పడటంతో గాయాలయ్యాయా? లేక ఎవరైనా కావాలని తనను గాయపర్చారా అనే విషయం తెలియలేదు. ఆమె బాడీపై మాత్రం కొన్ని గాయాలే ఉన్నాయి. దీంతో ఆమె మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె పైనుంచి కింద పడితే అంత తక్కువ గాయాలయ్యే అవకాశం లేదు. అసలు ఏం జరిగిందనే విషయం తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నికిత.. బుల్లి తెర నటి. కొన్ని ఒడిశా సినిమాల్లోనూ నటించింది. చోరి చోరి మానా చోరి, మారా పంతకని, స్మయిల్ ప్లీజ లాంటి సినిమాల్లో నికిత నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news