మరొకసారి పవిత్ర లోకేష్ పై దారుణమైన ట్రోలింగ్..!

-

సీనియర్ నరేష్ తో పవిత్ర లోకేష్ సహజీవనం చేయడం.. ఆమెను నాలుగో పెళ్లి చేసుకుంటాను అని అనడంతో పెద్ద ఎత్తున వార్తలు బాగా వైరల్ అయితున్నాయి. అంతేకాదు పవిత్ర లోకేష్ తో కలసి నరేష్ మైసూర్ హోటల్ రూమ్లో మూడో భార్య రమ్య కి పట్టుబడడం ఇవన్నీ జనాల్లో ఆసక్తిని క్రియేట్ చేశాయి.. ఏది ఏమైనా జనాల్లో పవిత్ర లోకేష్ తోనే కలిసి ఉంటాను అన్నట్టుగా నరేష్ ప్రవర్తిస్తున్నాడు. అయితే ఈమధ్య కాలంలో వారి మధ్య విభేదాలు వచ్చాయని , ప్రస్తుతం వీరిద్దరూ కలిసి జీవించడం లేదు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ అంతలోపే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆసుపత్రిలో చేరడంతో నరేష్ , పవిత్ర లోకేష్ తో కలిసి హాస్పిటల్ కి రావడంతో ఈ వార్త మరొకసారి వైరల్ గా నిలిచింది.

అంతేకాదు కృష్ణ మరణించిన తర్వాత కూడా పవిత్ర ను పట్టుకొని మరీ సూపర్ స్టార్ కి నివాళులర్పించారు నరేష్. అంతేకాదు కృష్ణ గారి చిన్న కర్మలో కూడా నరేష్ , పవిత్ర ఇద్దరూ కలిసి కనిపించడం మాత్రమే కాదు .. ఇద్దరూ కలసి స్టేజ్ ఎక్కి కృష్ణ గారి ఫోటోకు నమస్కారం పెట్టారు. ఇవన్నీ చూసిన నెటిజెన్స్ పవిత్ర పై దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా నరేష్ అనవసరంగా పవిత్ర లోకేష్ ను తగులుకున్నాడు. ఆమె సూపర్ స్టార్ ఇంట అడుగుపెట్టాకే వాళ్ళ ఇంటిలో చాలామంది వరుసగా మరణించడంతో.. ఈమె దరిద్రం వల్లే వారి ఇంట్లో అంత నష్టం జరిగింది అంటూ కొంతమంది నెటిజన్ లు చాలా పచ్చిగా కామెంట్లు చేశారు.

ఆమె ఒక ఐరన్ లెగ్ అని, ఆమె ప్రవేశం ఘట్టమనేని కుటుంబానికి ప్రాణాంతకంగా మారింది అంటూ పవిత్ర లోకేష్ పై నేటిజన్స్ దారుణంగా ట్రోల్స్ మొదలుపెట్టారు. మరి దీనిపై వీరు ఎలా స్పందిస్తారో తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news