ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ `పింక్‌` తెలుగు రీమేక్ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అజ్నాతవాసి మూవీ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయ్యాడు. అయితే పాలిటిక్స్‌లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ వర్గాలు ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికి టాలీవుడ్ వర్గాలు మాత్రం అవుననే సమాధానం వినిపిస్తుంది. కాగా, హిందీలో ఆ మధ్య వచ్చిన ‘పింక్’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్యనే తమిళంలో అజిత్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా ఆయన ఈ సినిమాను నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే పవన్ ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదనే వార్తలు కూడా ఇటీవల షికారు చేశాయి. సంక్రాంతికి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా ‘దిల్’ రాజు ఏర్పాట్లు చేస్తుండటంతో, పవన్ ఈ సినిమా చేస్తున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో మళ్లీ ఊపందుకుంది. మొదటి షెడ్యూల్లో పవన్ పాల్గొనడనీ, ఆయన కాంబినేషన్ లేని సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారని అంటున్నారు. పూర్తివివరాలు త్వరలో తెలియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news