పూర్ణ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..కాబోయే వాడిని పరిచయం చేసిన నటి

-

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూర్ణ అలియాస్ షామ్నా ఖాసిం తన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. అసలు ఈ విషయం నిజమేనా? అని అభిమానులు ఆశ్చర్యపడేలా చేసింది.

వివరాల్లోకెళితే..ఇన్ స్టా గ్రామ్ వేదికగా పూర్ణ..తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. పూర్ణ ప్రకటనతో..చడీ చప్పుడు లేకుండా ఈ వ్యవహారం అసలేలా జరిగిందని నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.

పూర్ణ..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఈ భామకు దక్కనప్పటికీ ..తెలుగు వారిని ఎంటర్ టైన్ చేస్తోంది. ‘ఢీ’ షో జడ్జిగా వ్యవహరిస్తూనే మరో వైపున వెండితెరపైన కనబడుతోంది. ఇటీవల ‘అఖండ’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది పూర్ణ.

ఈ సంగతి పక్కనబెడితే..పూర్ణ తన జీవితంలో నెక్స్ట్ స్టెప్ లోకి ఎంటరయ్యారు. 32 ఏళ్ల వయసులో మ్యారేజ్ కు రెడీ అయిపోయారు. షానిద్ అసిఫ్ అలీతో ఎంగేజ్ మెంట్ అయిందని రింగ్ ఎమోజీ పోస్ట్ చేసి నెటిజన్లకు సర్ ప్రైజ్ ఇచ్చింది పూర్ణ.

అసిఫ్ అలీ జేబీఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈవో కాగా, కోట్ల రూపాయలకు అధిపతి అని సమాచారం. ఇది పెద్దలు కుదిర్చినా పెళ్లినా లేకా? ప్రేమ వ్యవహారమా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా, చూడ చక్కగా ఉన్న ఈ జంటకు సినీ ప్రముఖులు, నెటిజన్లు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news