మహర్షిలో ఛాన్స్ పట్టేసింది

-

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ మహర్షి. మఏష్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది. ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా మరో యంగ్ హీరోయిన్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. అడవి కాచిన వెన్నెల సినిమాలో నటించి మెప్పించిన మీనాక్షి దీక్షిత్ మహర్షి సినిమాలో నటిస్తుందట.

మహేష్ సినిమాలో ఆఫర్ రావడంపై మీనాక్షి తెగ సంబరపడుతుంది. తెలుగులో సత్తా చాటేందుకు తనకు ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుందని భావిస్తుంది మీనాక్షి. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పూజాతో పాటుగా మీనాక్షి మెరుపులు ఈ సినిమాకు ప్లస్ అవనున్నాయి.

2019 ఏప్రిల్ 5 ఉగాది సందర్భంగా మహర్షి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news