మహాభారతం పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..!

-

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన విజన్ తో మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలను తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే మహాభారతాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఒక అద్భుత దృశ్య కావ్యంగా విజువల్ వండర్ గా తెరకెక్కించాలనే కోరిక ఉన్నట్లు.. రాజమౌళి ఇప్పటికే పలు సందర్భాలలో తన కోరికను బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ మహాభారతం సినిమాను ఎప్పుడు ఆయన తెరపైకి తీసుకొస్తాడు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తన డ్రీం ప్రాజెక్టు గురించి అదిరిపోయే కామెంట్లు చేయడం గమనార్హం.. ఇకపోతే భారతీయ ఇతిహాసం అయిన మహాభారతాన్ని తెరకెక్కించడానికి తమ వద్ద కొన్ని ప్లాన్స్ ఉన్నాయని.. అయితే ఎప్పుడు అప్లై చేయాలి అనేది ఇంకా నిర్ణయించుకోలేదు అంటూ రాజమౌళి తెలిపారు.. అంతేకాదు బుల్లితెరపై ఇప్పటికే కొన్ని వందల ఎపిసోడ్స్ రూపంలో మహాభారతాన్ని ఆవిష్కరించారు. సిల్వర్ స్క్రీన్ పై ఎవరికి తోచిన విధంగా వారు అనేక భాగాలుగా ఆవిష్కరించారు.

కానీ మహాభారతాన్ని ఎన్నిసార్లు చూసినా.. విన్నా చాలా అద్భుతంగానే ఉంటుంది.. మహాభారతం ఎంతో పెద్ద కథ.. చాలా సంక్లిష్టమైనది.. ప్రతి చిన్న పాత్రకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి కథను ఆవిష్కరించాలంటే పది భాగాలలో తెరకెక్కించాలి అంటూ రాజమౌళి తెలిపారు. ఇక మహాభారతం విషయంలో తన మైండ్లో విజన్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఎలా చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు.. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తాను అంటూ ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news