మహేశ్, ప్రభాస్ హీరోలుగా జ‌క్క‌న్న తదుపరి చిత్రం..?

-

సినిమా చేస్తే సంచలనం అవ్వాలి, స్టార్ దర్శకుడు అవ్వాలి అంటే అలాగే చెయ్యాలి. స్టార్ దర్శకుడి నుంచి అగ్ర దర్శకుడు అవ్వాలి అంటే ఆ విధంగానే ముందుకి వెళ్ళాలి. సాదా సీదా సినిమాలు చేస్తే కుదిరే పని కాదు. రాజమౌళి అందుకే ఎక్కడా కూడా తాను చేసే సినిమాల విషయంలో రాజి పడే అవకాశం ఉండదు. సినిమా చేస్తే చరిత్రలో నిలిచిపోవాలి. ఇతర సినిమాల దర్శకులు దాని గురించి మాట్లాడుకోవాలి.

నానీతో ఈగ సినిమా చేసినా, సునీల్ లాంటి హీరోతో మర్యాద రామన్న సినిమా చేసినా సరే వాటికి ఒక రేంజ్ ఉంది. బాహుబలి సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఆ సినిమా గురించి టాలివుడ్ తో పాటుగా బాలీవుడ్ కూడా మాట్లాడుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఇది పక్కన పెడితే రాజమౌళి ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ప్రభాస్, మహేష్ బాబుతో ఒక సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను పీరియాడికల్ డ్రామా గా తెరకెక్కించే యోచనలో ఉన్నాడు. ఎప్పటి నుంచో రాజమౌళి మహేష్ తో సినిమా చెయ్యాలని భావిస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే కీలక అడుగు వేసినట్టు సమాచారం. మహేష్, ప్రభాస్ ఇద్దరూ కూడా దీనికి అంగీకారం తెలిపారట. దీనితో వచ్చే ఏడాది ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించే అవకాశం ఉందని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news