ఉత్తరాఖండ్​లో తలైవా.. మహావతార్ బాబా గుహలో ధ్యానం

-

సూపర్ స్టార్ రజనీకాంత్​ ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. జైలర్ సినిమా రిలీజ్​కు ముందు ఆధ్యాత్మిక పర్యటనకు బయల్దేరిన ఆయన తొలుత హిమాలయాలకు వెళ్లారు. అనంతరం బద్రీనాథ్​ క్షేత్రాన్ని సందర్శించిన ఆయన.. తాజాగా ఉత్తరాఖండ్ ​అల్మోరాలోని ద్వారహత్​కు చేరుకున్నారు. అక్కడున్న మహావతార్ బాబా గుహలో 30 నిమిషాలు ధ్యానం చేశారు. యోగదా ఆశ్రమంలోని సాధువులను కలుసుకున్నారు.

మార్గమధ్యంలో ఆయన్ను చూసేందుకు తరలి వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగారు. మరుసటి రోజు ఉదయం ఆయన రాంచీకి బయలుదేరారు. బాబా గుహలను సందర్శించిన ఆయన.. ఆ తర్వాత ఝార్ఖండ్​లోని రాంచీకి వెళ్లారు. అక్కడి గవర్నర్‌ సీపీ.రాధాకృష్ణన్​ను కలిసి కాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను గవర్నర్​ రాధాకృష్ణ ట్విటర్​ వేదికగా పంచుకున్నారు.

“రాంచీకి రజనీ రావడం ఆనందంగా ఉంది. నా ప్రియ మిత్రుడైన ఆయనను రాజ్‌భవన్‌లో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఝార్ఖండ్‌ అనే గొప్ప ప్రదేశానికి ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను” అంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news