ఆ డైరెక్టర్ ను మోసం చేసిన రమ్య కృష్ణ.. అసలు విషయం ఏమిటంటే..?

-

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో గత కొంతకాలం నుంచి స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన ఎంతోమంది నటీమణులలో రమ్యకృష్ణ మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. రమ్యకృష్ణ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. రమ్యకృష్ణ గతంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ గా మారింది. నిజానికి ఈమె నటించిన కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తుంటే.. మరికొన్ని సినిమాలు డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంటున్నాయి.

ఇకపోతే ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గీతాకృష్ణ.. ఒక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీ అప్పుడు టికెట్ రేట్లు పెంచమని చెప్పి.. ఇప్పుడు తగ్గించమని అడుగుతోంది అని ఆయన తెలిపారు. రమ్యకృష్ణ గురించి మాట్లాడుతూ సంకీర్తన సినిమా కోసం కొత్త హీరోయిన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు రమ్యకృష్ణను తీసుకున్నామని గీతాకృష్ణ వెల్లడించారు ఇకపోతే తెలుగు సినీ ఇండస్ట్రీకి రమ్యకృష్ణ ను నేనే పరిచయం చేశానని అనుకున్నానని ఆయన తెలిపారు.Director Geetha Krishna 's Cheap Talk on Heroines Sleeping for Films

కానీ సంకీర్తన సినిమా విడుదలైన మూడు సంవత్సరాలకు రమ్యకృష్ణ ఈ సినిమా కంటే ముందే మరో తెలుగు సినిమాలో చిన్న రోల్ లో నటించిందని అప్పుడే తెలిసిందని గీతాకృష్ణ వెల్లడించారు. అయితే ఆ విషయం తెలిసి నాకు చాలా కోపం వచ్చిందని.. ఆ విషయాన్ని ఆమె నాకు చెప్పకుండా ఇదే మొదటి సినిమా అంటూ అబద్ధం చెప్పి మోసం చేసింది అని గీతాకృష్ణ వెల్లడించారు. ఇకపోతే నరసింహ సినిమా సక్సెస్ వల్లే రమ్యకృష్ణ కు మంచి పేరు వచ్చిందని వెల్లడించిన గీతాకృష్ణ రాఘవేంద్రరావు సినిమాలే ఆమెకు సక్సెస్ ను ఇచ్చాయి అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news