‘రంగ రంగ వైభవంగా’ నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!

-

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్. అయితే తన డెబ్యూ ఫిలిం ఉప్పెన సినిమాతో యూత్ ను ఆకట్టుకున్నాడు .. ఆ తరువాత ‘కొండ పొలం’తో మాస్ ఆడియన్స్ కి చేరువయ్యాడు వైష్ణవ్ తేజ్. ఆయన మూడో సినిమాగా ‘రంగ రంగ వైభవంగా’ రూపొందింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్.

తమిళంలోకి ‘అర్జున్ రెడ్డి’ని రీమేక్ చేసిన గిరీశాయ ఈ సినిమాకి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో వైష్ణవ్ జోడీగా కేతిక శర్మ అందాల సందడి చేయనుంది. వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయ నున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి సిరిసిరి మువ్వల్లోనా అనే సాంగ్‌ రిలీజ్‌ అయింది. ఈ పాటలో.. హీరో, హీరోయిన్లు ఎంతో అందంగా కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news