వారి వల్లే నా సినిమా ఎంట్రీ : హీరోయిన్ రష్మిక

-

రష్మిక మందన్న ఛలో మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. వచ్చీరాగానే తెలుగు కుర్రాళ్ల మదిని దోచేసింది. తన క్యూట్ నెస్ తో ఈ భామ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. పుష్పతో ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందింది.

అయితే, తాజాగా హీరోయిన్ రష్మిక తన సినిమా ఎంట్రీ పై పలు విషయాలను వెల్లడించింది. కన్నడ నటులు రక్షిత్ శెట్టిల వల్లే తాను ఒక నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపింది. వాళ్లే నాకు ఇండస్ట్రీలోకి దారి చూపించారు. హీరోయిన్ గా తొలిసారి అవకాశం ఇచ్చారు అని పేర్కొంది. కాగా కొద్ది రోజుల క్రితం రిషబ్ శెట్టి నటించిన కాంతారా సినిమా చూడలేదంటూ, చెప్పడంతో కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news