మోడీగారిపై పోరాడే సిపాయి..కేసీఆర్‌ గారే – విజయశాంతి

-

విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మహా దేశ నాయకులు కేసీఆర్ గారు, భగవంత్ మాన్ గారు మన మోడీగారిపై పోరాడే సిపాయిలు ! నమ్మేట్లుందా, దేశ ప్రజలు? అంటూ ట్వీట్‌ చేశారు విజయశాంతి. వీరికెందుకో మరి ప్రజా జీవితంలో రాజకీయ నేతల విలువలు ధోరణి ఉండాలనే కమ్యూనిస్టుల అనవసర సమర్ధన అంటూ ఫైర్‌ అయ్యారు.

దేశంలోనే అత్యంత అవినీతిపరులైన సీఎం కేసీఆర్ గారికి… వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పుకునేవారు మద్దతిచ్చి, నేటి ఖమ్మం సభలో ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారో వారికే తెలియాలి. అయినా ఈ లిక్కర్ స్కాంల, లిక్కర్ స్కీంల తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కమ్యూనిస్ట్‌లు ఎందుకో అవసరం లేని సయోధ్య, తమ సిద్ధాంతాలకు దూరమై కనపరుస్తున్నారని అనిపిస్తున్నదన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news