అతని మాయలో పడి అలాంటి పని చేయబోతున్న రష్మీక..!!

-

 తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ రష్మిక మందన్న. ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కూడా పేరు పొందింది. నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది. దీంతో బాలీవుడ్లో కూడా వరుస ఆఫర్లను అందుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అన్ని ఇండస్ట్రీలో కూడా ఒకటి రెండు సినిమాలు చేస్తూ బాగా ముందు వరుసలో ఉన్నది.

తెలుగులో విజయ్ తో ఒక సినిమా, పుష్ప -2 లో కూడా నటిస్తున్నది. అయితే ఈ ముద్దుగుమ్మ కి పేరు రావడానికి గల కారణం గీతగోవిందం సినిమా అని చెప్పవచ్చు. మొదట ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఈమెకు బాగా కలిసి వచ్చింది మాత్రం గీతగోవిందం చిత్రమని చెప్పవచ్చు. ఇందులో విజయ్ దేవరకొండ నటించారు. ఇక వీరిద్దరూ అప్పటినుంచి మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ అనే సినిమా కూడా విడుదల అయింది. కానీ ఈ సినిమాతో వీరిద్దరి మీద పలు రూమర్స్ కూడా బాగా స్ప్రెడ్ అయ్యాయి. దీంతో ఈ వార్తలను వీరిద్దరూ ఖండించి స్నేహితులమని చెప్పుకొచ్చారు.

రష్మిక తన స్నేహితుడి కోసం ఒక ఐటెం సాంగ్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే పూరి జగన్నాథ్ తోనే జనగణమన సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో రష్మిక ఐటెం సాంగ్ లో నటించబోతున్నట్లు సమాచారం. మరి ఈ సాంగ్ తో ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే రష్మిక ఈ పాటకి ఒప్పుకుందా లేదంటే ఇది కేవలం రూమర్ మాత్రమేనా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news