రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్!

-

వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కబోతున్న పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 1970 – 80 లలో స్టువర్టుపురం గజదొంగ గా పోలీసులకు నిద్ర లేకుండా చేసిన టైగర్ నాగేశ్వరరావు కథ ఇది. నుపుర్ సనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియన్ స్టార్ గా మారబోతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. విక్టరీ వెంకటేష్ అదిరిపోయే వాయిస్ ఓవర్ తో మొదలయ్యే ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. పులుల్ని వేటాడే పులిని చూశారా..? అంటూ రవితేజ చెప్పే హై వోల్టేజ్ డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మరి అక్టోబర్ 20న రవితేజ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో..? లేదో..? వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news