న్యాచురల్ బ్యూటీ సైలెంట్ అవ్వడానికి కారణం..?

-

సాయి పల్లవి ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఫిదా సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే ఎంతోమంది కుర్రకాలను సైతం ఆకట్టుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో స్టార్డమ్ సంపాదించింది. అయితే తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకొని ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం తన నటనకి ఎక్కువ ప్రాధాన్యత ఉండే సినిమాలను చేస్తూ ఉన్నది సాయి పల్లవి.

చివరిగా ఈమె విరాటపర్వం, గార్గి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ రెండు చిత్రాలు పర్వాలేదు అనిపించుకున్నది. నటనపరంగా మరొక మెట్టు పైకి ఎదిగింది సాయి పల్లవి అని చెప్పవచ్చు. మరొకవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అయితే ఇప్పుడు సాయి పల్లవి తన తదుపరి సినిమా ఏంటి అనే విషయంపై అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరిగా ఈమె గార్గి సినిమా తర్వాత మరే సినిమాని తను ప్రకటించలేదు సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ అంతగా యాక్టివ్ గా లేదు.

ఇప్పుడు ఒకవైపు సినిమాలలో మరొకవైపు సోషల్ మీడియాలో కూడా సైలెంట్ గా ఉండడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడుతున్నారు. అయితే పుష్ప సినిమాలో నటిస్తోందని వార్తలు గత కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపించాయి.. కానీ ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే అభిమానులు మాత్రం సాయి పల్లవి ఎందుకు సైలెంట్ అయింది ఆఫర్లు రావడం లేదా.. తనే సినిమాలకు దూరంగా ఉందా అంటూ అభిమానులు సైతం చర్చించుకుంటూ ఉన్నారు. మరి సాయి పల్లవి ఈ విషయంపై స్పందిస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news