ఆలి షోలో రేణు దేశాయ్.. ఒక్క రూపాయ్ ఇవ్వలేదు.. ఆద్య లేకుంటే చచ్చిపోయేదాన్ని..!

-

కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆలి ఈమధ్య బుల్లితెర మీద ఓ టాక్ షో చేస్తున్నాడని తెలిసిందే. 40 ఏళ్ల సిని పరిశ్రమలో ఆలి సినిమా వాళ్లను ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశాడు. లేటెస్ట్ గా ఆలి టాక్ షోలో రేణు దేశాయ్ పాల్గొనడం జరిగింది. పవన్ మాజి భార్య అయిన రేణు దేశాయ్ ఆలి టాక్ షోతో పాల్గొనడం హాట్ న్యూస్ గా మారింది. అంతేకాదు ఆ షో ప్రోమో ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.

టాక్ షోలో ప్రశ్న ఒకటి జవాబు మరొకటి ఉంటుంది. ఈ గ్యాప్ లో ఎడిటర్ తన టాలెంట్ చూపించి ప్రోమో ఇంట్రెస్టింగ్ గా కట్ చేస్తాడు. లేటెస్ట్ గా ఆలి షోలో పాల్గొన్న రేణు దేశాయ్ ఆమె జానీ, ఖుషి సినిమాలకు ఎడిటర్ గా పనిచేసినా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని అన్నారు రేణు దేశాయ్. కావాలంటే దీని గురించి ఎస్.జె. సూర్య, ఏ.ఎం రత్నం, పవన్ కూడా సాక్ష్యమని అన్నారు. తన రెండో పెళ్లి గురించి మీడియాలో జరిగిన డిస్కషన్స్ ప్రస్థావన కూడా తెచ్చింది రేణు దేశాయ్. తను పుట్టినప్పుడు తన తండ్రి తనని చూడడానికి రాలేదని.. ఆద్యలేకపోతే తాను చచ్చిపోతానని అన్నారు రేణు దేశాయ్.


ఇక ఫైనల్ గా రేణు దేశాయ్ తిరిగి ఆలిని మీకు పవన్ కు ఈమధ్య గొడవ అయ్యిందట కాదా అన్న ప్రశ్న అడిగింది.. దానికి ఆలి కూడా అవును అని సమాధానం ఇచ్చారు. దానితో షో ప్రోమో ముగుస్తుంది. కచ్చితంగా పవన్ ఫ్యాన్స్ టార్గెట్ తో ఈ ప్రోమో కట్ చేశారని చెప్పొచ్చు. మరి ఈ టాక్ షో ఎలా నడుస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news