దొంగా పోలీస్ కథతో ఆర్.ఆర్.ఆర్..!

-

రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ ఇలా ముహుర్తం పెట్టారో లేదో అలా ఈ సినిమా కథ ఇదే అంటూ రకరకాల స్టోరీలు అల్లేస్తున్నారు. మొదటి నుండి ఇద్దరు బాక్సర్స్ కథ ఇదని టాక్ వినిపిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు మొత్తం స్టోరీ ఒకటి ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. 1920 కాలం నాటి దొంగ పోలీస్ కథగా ఈ సినిమా వస్తుందట. సినిమాలో దొంగగా ఎన్.టి.ఆర్, పోలీస్ గా రాం చరణ్ కనిపిస్తారట.

ఇద్దరు బాక్సర్స్ కావడంతో ఇద్దరు అక్కడ తలపడతారట. ఈమధ్యనే ముహుర్తం పెట్టిన రాజమౌళి సినిమా మొదటి షెడ్యూల్ భారీ ఛేజింగ్ సీన్ ప్లాన్ చేశాడట. ఇందులో ఎన్.టి.ఆర్, చరణ్ పాల్గొంటారని తెలుస్తుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాను డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై నేషనల్ మీడియా కూడా కన్నేసి ఉంచింది. సినిమా నిర్మించేది దానయ్యే అయినా ఆర్కా మీడియా, సాయి కొర్రపాటి కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతున్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news