వేశ్య పాత్రకు ఓకే చెప్పిన RX100 బ్యూటీ

-

స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 1970-80 కాలానికి చెందిన వ్యక్తి ఆయన. ఆ సినిమాలో పాయల్ వేశ్యగా నటిస్తుండగా… నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఆర్‌ఎక్స్100.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది పాయల్ రాజ్‌పుత్. ఎక్కడో పంజాబీ అమ్మాయి.. పెద్దగా సినిమాలు చేసిన అనుభవం కూడా లేదు కానీ.. ఆర్‌ఎక్స్100 సినిమాలో మాత్రం ఇరగదీసింది. అందుకే.. ఇప్పుడు దర్శకనిర్మాతలు పాయల్ వెనుక పడుతున్నారు. దీంతో ఆమె రేంజ్ కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం తన చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి.

అయితే.. ఇటీవల పాయల్.. వేశ్య పాత్ర చేయడానికి ఓకే చెప్పిందట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమాలో వేశ్య పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 1970-80 కాలానికి చెందిన వ్యక్తి ఆయన. ఆ సినిమాలో పాయల్ వేశ్యగా నటిస్తుండగా… నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

నిజానికి.. ఆ సినిమాలో వేశ్య పాత్రే హైలెట్ అట. ఆ పాత్ర కోసం సినిమా యూనిట్ చాలామందిని జల్లెడ పట్టారట. కానీ.. చివరకు పాయల్‌ను సెలెక్ట్ చేసుకున్నారట. వంశీ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news