సాయి ధరం తేజ్ సొంత కథ.. వాళ్ల మీద నమ్మకం పోయిందా..!

-

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు. కళ్యాణి ప్రియర్శిని, నివేథా పేరుతాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత సాయి ధరం తేజ్ సొంత కథతో ప్రయోగం చేస్తున్నాడని తెలుస్తుంది. హీరో కథ రాయడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ఒకప్పుడు ఎన్.టి.ఆర్, కృష్ణ వంటి స్టార్స్ తమ సినిమాలకు తామే కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ చేశారు.

ఇప్పటికి డైరెక్ట్ చేస్తూ హీరోలుగా చేసే వారు ఉన్నారు. కాని యువ హీరోల్లో సాయి ధరం తేజ్ ఈ ప్రయత్నం చేస్తున్నాడట. ఆరు సినిమాలుగా దర్శకుల మీద డిపెండ్ అవుతున్నా తనకు హిట్ ఇవ్వట్లేదని ఈసారి సాయి ధరం తేజ్ తన సినిమాకు సొంత కథ రాసుకున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి కాగా త్వరలో ఫుల్ స్క్రిప్ట్ ఫైనల్ చేస్తాడట. మరి దర్శకుడు మీద నమ్మకం లేకనో ఏమోకాని సాయి ధరం తేజ్ కొత్తగా రైటర్ అవతారం ఎత్తాడు. ఈ కొత్త స్టెప్ తేజూకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news