రామ్ చరణ్ కోసం కదిలిన సాయి మాధవ్… శంకర్ సినిమా కోసమే..

-

మెగా స్టార్​ చిరంజీవి నట వారుసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్(​ram charan)​. ప్రస్తుతం దర్శకధీరుడు జక్కన్న దర్శకత్వంలో వస్తున్న మల్టీస్టారర్​ RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ మూవీలో రామ్​ చరణ్​ తో పాటు మరో టాలీవుడ్​ స్టార్​ హీరో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. నిర్మాణం చివరకు వచ్చిన ఈ మూవీని సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు ప్లాన్​ చేస్తున్నారు. మెగా పవర్​ స్టార్​ రామ్ చరణ్​ ఈ మూవీ సెట్స్​ పై ఉండగానే భారీ చిత్రాల దర్శకుడు శంకర్​ తో మరో మూవీని కూడా పట్టాలెక్కించాడు. ​RRR మాత్రమే కాకుండా ఈ హీరో తన తండ్రితో కలిసి కొరటాల శివ చేస్తున్న ఆచార్య మూవీని నిర్మిస్తూ… అందులో మెరువనున్నాడు. ఇందులో రామ్​ చరణ్​ పాత్ర నిడివి తక్కువే అయినా ఆయన పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుందని టాక్​. ఈ మూవీలో చరణ్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది.

శంకర్ డైరెక్షన్ లో ఈయన చేసే మూవీ కోసం స్టార్ రైటర్ గా పేరుతెచ్చుకున్న సాయిమాధవ్ బుర్రాని డైలాగ్​ రైటర్​ గా ఎంపిక చేశారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్​ అఫీషియల్​ గా నిర్ధారించింది. సోషల్​ మీడియా వేదికగా రైటర్​ సాయి మాధవ్​ స్పందిస్తూ… శంకర్​ లాంటి స్టార్​ డైరెక్టర్​ తో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీని టాలీవుడ్​ బడా నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. అంతే కాకుండా ఈ మూవీ దిల్​ రాజు బ్యానర్​ లో 50 వ చిత్రం కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news