చైతూ ఇంటిని కొనుగోలు చేసిన సమంత.. అసలు విషయం తెలిపిన మురళీమోహన్..!!

-

ఏం మాయ చేసావే సినిమా ద్వారా మొదటిసారిగా నాగచైతన్య తో నటించిన సమంత ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, ఆ స్నేహం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల చేత గత ఏడాది అక్టోబర్ నెలలో విడిపోయారు. అయితే వీరు ఎందుకు విడిపోయారు అన్న విషయం ఇప్పటికీ సస్పెన్స్ గానే మిగిలింది. అయితే వీరిద్దరి వ్యవహారంపై నెలలు తరబడి పలు చర్చలు కూడా జరిగాయి. అయితే ఇటీవల సీనియర్ హీరో అయిన మురళీమోహన్ కూడా వీరి గురించి పలు విషయాలను తెలిపారు.మురళీమోహన్ తను నిర్మించుకున్న అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ను నాగచైతన్య సమంత ఎంతో ముచ్చట పడ్డారు. కానీ తను ఇవ్వనని చెప్పినా కూడా నాగార్జున సహాయంతో ఆ అపార్ట్మెంట్ ని తీసుకొని అందులో అన్యోన్యంగా ఈ జంట ఉండేవారు అని తెలిపారు. కానీ ఎందుకు విడిపోయారో తెలియదని ఆ విషయం తనకు తెలిసి షాక్ అయ్యానని తెలిపారు. అయితే తాజాగా ఆ ఇంటి గురించి పలు ఆసక్తికరమైన విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది మురళి మోహన్.

మురళీమోహన్ ఇంటిని వారిద్దరు విడిపోయాక వద్దని చెప్పి వేరే వాళ్ళకు అమ్మారట. వారు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయాక తిరిగి సమంత ఆ ఇంటిని మళ్లీ అత్యధిక ధరకు సొంతం చేసుకున్నదని తెలిపారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఎక్కడికి వెళ్లినా కూడా తనకి సౌకర్యంగా అనిపించకపోవడం వల్లే.. ఈమె ఆ ఇంటిని మళ్లీ అధిక ధరకు కొనుక్కున్నదని మురళీమోహన్ తెలియజేయడం జరిగింది. అయితే మధ్యలో కొంతమంది ఆ ఇంటిని కొనుక్కున్నారని.. కానీ సమంత ఆ ఇంటిని అడిగినప్పుడు కూడా తాను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నానని తెలిపారు. అయితే ఇంత మంచి ఇల్లు తనకి ఎక్కడ దొరకడం లేదని సమంత తనతో అనడంతో. అప్పుడు ఆ ఇంటి ఓనర్ తో మాట్లాడి ఆ ఇల్లు కొన్న రేటు కంటే అధిక లాభం ఇచ్చి సమంత ఆ ఇంటిని సొంతం చేసుకుందని మురళీమోహన్ తెలిపారు. ప్రస్తుతం సమంత తన అమ్మతో కలిసి ఆ ఇంట్లో ఉందని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం నాగచైతన్య సమంతకి ఆ ఇంటిని ఇచ్చాడని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ అలాంటిది ఏమీ లేదని మురళీమోహన్ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news