యశోద ప్రమోషన్స్ లో సమంత..ఫోటోలు వైరల్

-

అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ గురువారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా 11-11-2022 నాడు థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం నిర్మాతలు కూడా చాలా కష్టపడుతున్నారు. దీనికి కారణం సమంత అనారోగ్యం.

యశోద ప్రమోషన్లలో సమంత పాల్గోనడం కష్టమేనని  అనుకున్నారు.  ఆమె ఆరోగ్య పరిస్థితుల కారణండా నిర్మాతలు కూడా సైలెంట్ గా ఉంటున్నారు.

సమంతను వదిలి ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ లతో ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారు. సమంత ప్రమోషన్లకు వెళ్లకుండా యశోద సినిమాకు హైప్ క్రియేట్ అవడం కష్టమేనని అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా యశోద ప్రమోషన్లకు హాజరయ్యారు. ఈ మేరకు సమంత తన సోషల్‌ మీడియా వేదిక గా ప్రకటించారు. ఇప్పుడు పిక్స్‌ వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news