మరో సారి మెగా కాంపౌండ్‌లో సంపత్ నంది..ఈ సారి ‘రచ్చ’ను మించిన సినిమా!

-

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సంపత్ నంది ‘ఏమైంది ఈ వేళ’ పిక్చర్ తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ సినిమాతోనే డిఫరెంట్ జోనర్ మూవీ చేసి సక్సెస్ అందుకున్న సంపత్…రెండో ఫిల్మ్ కోసం ఏకంగా మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టేశారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘రచ్చ’ అనే పిక్చర్ చేసి కమర్షియల్ డైరెక్టర్ అయిపోయి సక్సెస్ అందుకున్నారు. అయితే, ఆ తర్వాత కాలంలో సంపత్ నంది చేసిన సినిమాలు ఊహించన స్థాయి విజయాలను అందుకోలేకపోయాయి. ఇటీవల విడుదలైన ‘సీటీమార్’ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో గ్రామీ‌ణ ఆటలను ప్రోత్సహించడంతో పాటు మహిళా సాధికారిత గురించి చెప్పే ప్రయత్నం చేశారు సంపత్ నంది. ఈ క్రమంలోనే సంపతి నంది చూపు మరోసారి మెగా కాంపౌండ్ పైన పడింది. సంపత్ నంది మరోసారి మెగా చాన్స్ కొట్టేశారని ఫిల్మ్ నగర్ సర్కి్ల్స్ టాక్.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కోసం ఓ సూపర్ సబ్జెక్ట్ తయారు చేసిన సంపత్ నంది..ఆయనకు వినిపించగా, ఓకే చెప్పేశారని వినికిడి. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో సక్సెస్ అయిన సినిమాలు ఉన్నాయి. కానీ, ఫుల్లీ కమర్షియల్ ప్లస్ మాస్ యాక్షన్ మూవీ లేదు. ఈ నేపథ్యంలోనే సంపత్ నంద్ స్టోరి విని సాయి ధరమ్ తేజ్ సబ్జెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడట. అయితే, త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే కాని ఈ విషయాలను కంప్లీ్ట్ గా నమ్మలేం.

Read more RELATED
Recommended to you

Latest news