సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ : మహేశ్ ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ పేరు – దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం !!

-

sarileru neekevvaru pre release event : ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతున్న రెండు బడా సినిమాలైన సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో సినిమాలపై ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. మహేష్, అనిల్ రావిపూడి ల ఫస్ట్ క్రేజీ కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు రూపొందుతోంటే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మూడవ కాంబినేషన్ లో అలవైకుంఠపురములో తెరకెక్కుతోంది.

సూపర్ స్టార్ మహేష్ ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి, ప్రస్తుతం సరిలేరు తో హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. హైదరబాద్ లో అట్టహాసం గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కన్నుల పండుగ గా జరిగింది. మెగా – సూపర్ ఈవెంట్ గా నామకరణం జరిగిన సంగతి తెలిసిందే.

అదే రేంజ్ లో మెగాస్టార్ కోసం మెగా ఫాన్స్ , మహేశ్ కోసం మహేశ్ అభిమానులు ఎల్‌బి స్టేడియం లో నిండిపోయారు… ఈ సినిమా కి పని చేసిన టెక్నీషియన్స్ అందరూ మాట్లాడుతూ అనిల్ రావిపూడి కామెడీ గురించి , మహేశ్ ని అతను మలచిన టైమింగ్ గురించి చెప్పుకొచ్చారు .. ఈ సినిమా లో కమీడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేశ్ మాట్లాడుతూ మహేశ్ బాబు తో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చారు .. ఒక స్టార్ చొరవతో(పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి) స్టార్ ప్రొడ్యూసర్ అయ్యా. ఈ టైం గ్యాప్ లో రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశా. 7 గంటలు, బ్లేడు గణేష్ ఇలా పిలిపించుకుని ఎర్రి డాష్ …డాష్ అనిపించుకున్నా అంటూ గణేష్ సరదాగా వ్యాఖ్యానించారు…. అయితే పవన్ కల్యాణ్ పేరు ఇన్ డైరెక్ట్ గా ఎత్తినా కూడా పవన్ కి అక్కడ వచ్చిన రెస్పాన్స్ సూపర్ గా ఉంది !!

Read more RELATED
Recommended to you

Latest news