విజయశాంతి – మహేశ్ – మెగాస్టార్ – కన్నులపండగ గా మారిన ఎల్‌బి స్టేడియం !!

-

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 వ తారీకున విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. చిరంజీవి మరియు విజయశాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక చోట కూర్చోవడంతో ఆఫ్రేమ్ చూసి ఈవెంట్ కి హాజరైన అభిమానులు గోల గోల చేశారు. ముఖ్యంగా ఇదే స్థలంలో గతంలో కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగటంతో సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సినిమా ఈవెంట్ కి వచ్చినా డైరెక్టర్ కొరటాల శివ ఇదే విషయాన్ని తెలియజేశారు. మొత్తంమీద చూసుకుంటే ఎల్బీ స్టేడియంలో జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా అభిమానులు మరియు సూపర్ స్టార్ అభిమానులు భారీ స్థాయిలో రావటంతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది.

 

బండ్ల గణేష్ స్పీచ్ ఇస్తున్నంత సేపు…గ్యాలరీ లో ఉన్న ఇద్దరు హీరోల అభిమానులు సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ అంటూ బండ్ల గణేష్ కాదు బ్లడ్ గణేష్ అంటూ ఏడిపించారు. దీంతో ఈ దెబ్బకి నా జీవితం మొత్తం ఇంకా సినిమా ఇండస్ట్రీ లోనే ఉంటాను వేరే రంగాల్లో కి వెళ్ళను అని దండం పెట్టేసాడు బండ్ల గణేష్. మొత్తంమీద చూసుకుంటే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో కన్నుల పండుగగా జరిగింది. 

Read more RELATED
Recommended to you

Latest news