వన్నె తగ్గని అందం..గుండెల్లో గంటలు మోగిస్తున్న సీనియర్ హీరోయిన్ లయ..

-

‘లయ’..అనే పేరు వినగానే మన పక్కింటి తెలుగు అమ్మాయిలా కనిపించే అందం అందరికీ గుర్తొస్తుంటుంది. బాపు గీసిన బొమ్మలా ఉండే హీరోయిన్ లయ నటించిన తెలుగు చిత్రాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటాయి.

లయ..చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషలలో దాదాపుగా టాప్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కూచిపూడి డ్యాన్సర్ అయిన లయ..2006 లో గణేష్ గోరటి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నదని టాక్. కాగా, సోషల్ మీడియాలో మాత్రం లయ చాలా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ‘ప్రశాంతంగా ఉండాలి’ అనే క్యాప్షన్ తో ఆకుపచ్చ రంగు బ్లేజెర్, ప్యాంట్ ధరించి సుజుకి బైక్ వద్ద నిలబడి ఉన్న ఫొటోలు షేర్ చేసింది.

సదరు ఫొటోల్లో రకరకాల స్టిల్స్ ఇచ్చింది నటి లయ. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు గుండెల్లో గంట మోగిస్తున్నావ్ లయ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. లయ తెలుగు ప్రేక్షకులకు చివరగా రవి తేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమాతో పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన లయ..త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో కీ రోల్ ప్లే చేయబోతున్నదని టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version