మహేష్ బాబు మూవీ నుంచి తప్పకున్న శ్రీ లీలా.. ఏమైందంటే..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం ఎగబడుతుంటే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది యంగ్ బ్యూటీ శ్రీ లీలా. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ సెకండ్ హీరోయిన్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. కానీ ఆశ్చర్యంగా ఆమె సినిమా నుంచి తప్పుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2021లో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందD సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తాజాగా రవితేజ నటించిన ధమాకా సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ప్రస్తుతం ఈమె చేతిలో ఏ టాలీవుడ్ హీరోయిన్ చేతిలో లేనన్ని అవకాశాలు ఉన్నాయి. సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరో గా రాబోతున్న సినిమాలో కూడా పూజా హెగ్డే మొదటి హీరోయిన్ గా .. ఈమె రెండో హీరోయిన్ గా ప్రకటించారు. అయితే సాఫీగా సాగిపోతున్న ఈ షూటింగ్లో చిన్న కుదుపు వచ్చింది. ఫారెన్ ట్రిప్ కి వెళ్ళిన పూజా హెగ్డే గాయపడింది. ఆమె కాలి మడమకు తీవ్ర గాయం కావడంతో చాలా రోజులు షూటింగ్ కి దూరంగా ఉండిపోయింది. అదే సమయంలో కృష్ణ మరణించడం మరికొన్ని రోజులు షూటింగుకి మహేష్ బాబు కూడా దూరమయ్యాడు.

ఈ ఖాళీ సమయంలో శ్రీ లీల ధమాకా సినిమాతో పాటు మొత్తం ఆరు సినిమాలకు సంతకం చేసింది. ఇప్పటికే ధమాకా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరొకటి బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది. అలాగే నితిన్, పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలకు కూడా సంతకం చేసింది. అందుకే ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది అంటూ మహేష్ బాబు సినిమా నుంచి ఈ ముద్దుగుమ్మ తప్పుకున్నట్లు సమాచారం . అయితే దీనిపై ఇంకా త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news