సౌత్​ హీరోయిన్స్​ జోరు.. బీటౌన్​లో బిగ్​ ఎంట్రీకి రెడీ!

-

రీజనల్​ ఇండస్ట్రీస్​లో హీరోయిన్​గా క్రేజ్​ సంపాదించుకున్న ముద్దుగుమ్మలంతా.. బాలీవుడ్​లో మెరవాలని ఆశపడుతుంటారు. అందుకు తగ్గట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పటికే పలువురు తారలు కూడా బీటౌన్​లో మెరిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో కొంతమంది స్టార్స్​గా ఎదగగా.. మరికొంతమంది దొరికిన అడపాదడపా ఛాన్స్​లతో సర్దుకుపోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో హీందీ పరిశ్రమలో సౌత్​ ఫ్లేవర్​ బాగా పెరిగిపోయింది. దీంతో ఇక్కడి ముద్దుగుమ్మలను తీసుకునేందుకు అక్కడి దర్శకనిర్మాతలు బాగా ఆసక్తి చూపుతున్నారు. తమ చిత్రాల కోసం మన భామలను ఎగరేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వివిధ బ్యానర్ల ద్వారా బీటౌన్​లోకి బిగ్​ ఎంట్రీ ఇవ్వనున్న కథానాయికలు ఎవరు? ఆ చిత్ర వివరాలను ఓ సారి తెలుసుకుందాం…

షారుక్​తో రొమాన్స్​.. మూడు పదుల వయసులోనూ అందరూ మెచ్చిన తళుకు తార.. నయనతార. కేవలం కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ.. వరుస చిత్రాలు, విజయాలతో దూసుకుపోతూ.. లేడీ సూపర్‌స్టార్‌గా మారింది. ప్రస్తుత తరంలో దక్షిణాది హీరోయిన్స్​లో అత్యంత ఎక్కువగా 74 చేసింది. రీసెంట్​గా 75 చిత్రాన్ని ప్రకటించింది. ఇటీవలే తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్​ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే బాలీవుడ్​ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంది. దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న యాక్షన్ థ్రిల్లర్​ చిత్రం ‘జవాన్​’లో బాలీవుడ్​ స్టార్​ హీరో షారుక్ ఖాన్​ సరసన నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో మంచి పవర్​ఫుల్​ క్యారెక్టర్​లో నయన్​ కనిపించనుందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్​ ప్రారంభమైనట్లు సమాచారం. రెడ్ చిల్లీ ఎంటర్​టైన్​మెంట్స్​ నిర్మిస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది జూన్​ 2న విడుదల కానుంది.

రష్మిక జోరు.. క్యూట్​ స్మైల్​, అదిరే అందంతో నేషనల్​ క్రష్​గా యువత గుండెను కొల్లగొట్టింది హీరోయిన్ రష్మిక. ‘పుష్ప’ చిత్రంతో దేశవ్యాప్తంగా ఫుల్​ క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం జోరు కొనసాగిస్తోంది. అయితే ఈ భామ ఇప్పటికే బాలీవుడ్​లో పలు చిత్రాలకు సంతకాలు చేసింది. అమితాబ్​ బచ్చన్​తో ‘గుడ్​బై’, సిద్ధార్ధ్​ మల్హోత్రాతో ‘మిషన్​ మజ్నూ’ సినిమాల షూటింగ్​ను ఇప్పటికే​ పూర్తి చేసుకుంది ఈ భామ. ప్రస్తుతం రణ్​బీర్​ ‘యానిమల్’లో నటిస్తోంది. ఇవ్వన్నీ త్వరలోనే రిలీజ్​ కానున్నాయి.

యమ స్పీడుగా సమంత.. విడాకుల తర్వాత కెరీర్​లో యమ స్పీడ్​తో దూసుకెళ్తోన్న హీరోయిన్ సమంత. ఫ్యామిలీ మ్యాన్​ వెబ్​సిరీస్​, పుష్ప తో బాలీవుడ్​లో ఫుల్​ క్రేజ్​ దక్కించుకున్న ఈ అమ్మడు.. పలు హిందీ సినిమాలను ఒకే చేసిందని తెలిసింది. తాను నిర్మించే ఓ హిందీ ప్రాజెక్ట్​లో సామ్​ నటించనుందని ఇటీవలే తాప్సీ ధృవీకరించింది. మరోవైపు యంగ్​ హీరో ఆయుష్మాన్​ ఖురానాతో కలిసి నటించేందుకు రెడీ అయిందని టాక్​ వినిపిస్తోంది. ఈ మూవీని మడాక్​ ఫిల్మ్స్, పీపింగ్ మూన్​ బ్యానర్స్​పై దినేశ్​ విజయన్​ నిర్మిస్తున్నారట. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్​ సెట్స్​పైకి వెళ్లనుందని తెలిసింది. ఇక వరుణ్​ ధావన్​తోనూ సామ్​ ఓ వెబ్​సిరీస్​ చేస్తున్నట్లు సమాచారం. ‘సిటాడెల్’​ అనే హాలీవుడ్​ యాక్షన్​ స్పై థ్రిల్లర్​ సిరీస్​కు ఇది ఇండియన్​ వెర్షన్​. రాజ్​ అండ్​ డీకే దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో వరుణ్​-సామ్​ గూఢచారులుగా కనిపించనున్నారట. 2023లో అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ కానుంది.

‘యోధా’గా రాశీ.. దక్షిణాదిలో నటిగా తనకంటూ ఓ స్టార్​డమ్​ను సంపాదించుకుంది హీరోయిన్ రాశీఖన్నా. ఇటీవలే బీటౌన్​​ స్టార్​ హీరో అజయ్​ దేవగణ్​తో కలిసి ఆమె నటించిన ‘రుద్ర:ది ఎడ్జ్​ ఆఫ్​ డార్క్​నెస్’ హిందీ వెబ్​ సిరీస్​​తో విశేష ప్రజాదరణ పొందింది. డిస్నీ హాట్​ స్టార్​లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్​సరీస్​లో రాశీ ఖన్నా నటనకు ప్రశంసలు అందాయి. అయితే ఇప్పుడు త్వరలోనే విడుదల కానున్న ‘యోధా’ చిత్రంలో ఈ భామ నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్​ స్టార్​ నటులు సిద్ధార్ధ్​ మల్హోత్రా, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్​ 11న మూవీ విడుదల కానుంది. అలానే రాజ్​అండ్​ డీకే రూపొందిస్తున్న ‘ఫర్జీ’ వెబ్​సిరీస్​లోనూ షాహిద్​కపూర్​తో కలిసి నటిస్తోంది.

పూజాహెగ్డే.. ఇప్పటికే రెండు, మూడు హిందీ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్​ పూజాహెగ్డే. కానీ సరైనా పెద్ద హిట్​ పడలేదనే చెప్పాలి. ఇక్కడ తెచ్చుకున్నంత క్రేజ్​ అక్కడ ఇంకా సంపాదించుకోలేదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్​ ‘కభీ ఈద్ కభీ దివాలీ’, రణ్​వీర్​ సింగ్​ ‘సర్కస్’​లో నటిస్తోంది. ఇవి రెండు సూపర్ హిట్​గా నిలిస్తే.. నార్త్​లో పూజా కెరీర్​కు ఏ ఢోకా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news