ఆ విషయంలో జక్కన్న తెగ బాధ పడ్తున్నాడట

-

బాహుబలి మూవీతో ఎస్ ఎస్ రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ దర్శకుడు అనిపించుకున్నారు. ఇండియన్​ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టారు. పాన్ ఇండియా రేంజ్​లో విడుదలైన ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా వసూళ్లలోనూ ప్రభంజనం సృష్టించింది.

ఇంతటి ఖ్యాతి గడించిన జక్కన్న ఓ విషయంలో చాలా బాధతో కుమిలిపోతున్నారట. అదేంటంటే.. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం భారతదేశం తరఫున ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ సాధించకపోవడం. ఈ విషయంలో తాను బాధపడ్డానని జక్కన్న అన్నారు.

“దేశం తరఫు నుంచి అధికారికంగా ఎంట్రీ సాధించకపోవడం వల్ల నిరాశ చెందాను. అయితే ఎంట్రీ ఎందుకు సాధించలేకపోయాం అంటూ ఆలోచించే వ్యక్తిని కాదు. మనం ముందుకు సాగిపోవాలి. మన దేశం నుంచి లాస్ట్‌ ఫిల్మ్‌ షో ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో స్థానం దక్కించుకున్నందుకు సంతోషిస్తన్నా. ఆర్‌ఆర్‌ఆర్‌ అధికారికంగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని విదేశీయులు కూడా అనుకుంటున్నారు. కానీ, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎలా ఉంటుంది? దాని నియమ నిబంధనలు ఏమిటి? అనేది నాకు తెలియదు. కాబట్టి దాని గురించి నేను కామెంట్‌ చేయాలనుకోవడం లేదు” అని జక్కన్న వివరించారు.

ఆర్​ఆర్​ఆర్​లో సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు చేసి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, ఆస్టిస్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌, బోస్టస్‌ సోసైటీ ఆఫ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డ్‌ వంటి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకుంది.

ఇక ఆస్కార్​ మాత్రమే మిగిలింది. అయితే ఈ సినిమాలోని నాటునాటు పాట ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో స్థానం దక్కించుకుంది. ఇకపోతే మన దేశం తరఫు నుంచి 10 చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌ కోసం పోటీ పడుతున్నాయి. జనవరి 24న నామినేషన్స్‌లో నిలిచిన చిత్రాల పేర్లను ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news