గ్రాండ్ గా వీరసింహారెడ్డి సక్సెస్ మీట్.. రేపే..!

-

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లుగా.. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించింది. మైత్రి మూవీ మేకర్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్ ను కొల్లగొడుతోంది. ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమా దాదాపు రూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి మరింత దూసుకెళ్తోంది. ఇకపోతే అఖండ సినిమా తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో కూడా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ సాధించడంతో బాలకృష్ణ అలాగే అభిమానులు, చిత్ర యూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఇదే సంక్రాంతికి మైత్రి నిర్మాతల దగ్గర నుంచి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా భారీ విజయం సాధించడంతో ఆ సినిమాకి సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పుడు వీర సింహారెడ్డి కి కూడా గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేయనున్నారు. వీరసింహుని విజయోత్సవం పేరిట వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ హాల్లో జనవరి 22వ తేదీన అంటే రేపు అభిమానుల మధ్య గ్రాండ్గా నిర్వహించబోతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సెలబ్రేషన్స్ కి బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున రానున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతోంది.

మొత్తానికైతే ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోని చిత్ర యూనిట్ మొత్తం విజయోత్సవాన్ని జరుపుకోనున్నారు. మరి ఈ ఈవెంట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news