SSMB28 : రిలీజ్‌ కు ముందే OTT డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న మహేష్‌ మూవీ

-

 

అతడు, ఖలేజా చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు నటుడు మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం #SSMB28 (వర్కింగ్‌ టైటిల్‌) ప్రకటన వెలువడటమే ఆలస్యం సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.


వీరి కాంబినేషన్ లో రానున్న పాన్ ఇండియా చిత్రం పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఇందులోని ఓ నెగిటివ్ పాత్ర కోసం ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్’ లో నటించి మెప్పించిన మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీని సంప్రదించారట.

అలాగే ఈ సినిమాలో శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారట. ఒక టాక్ క్రేజీ హీరోయిన్ అయిటమ్ సాంగ్ కూడా ఉందని సమాచారం. ఇది ఇలా ఉండగా, రిలీజ్‌ కు ముందే OTT డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది ఈ సినిమా. నెట్‌ ఫ్లిక్స్‌ లో ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు కాసేపటి క్రితమే ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news