“వాల్తేరు వీరయ్య” దెబ్బకు.. 70 శాతం పడిపోయిన ‘వీర సింహారెడ్డి’ బాక్సాఫీసు వసూళ్లు !

-

బాలయ్య వీర సింహారెడ్డి సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సినిమా విడుదలైన తొలి రోజు అంటే గురువారం రోజున రూ. 25.36 కోట్లు వచ్చాయి. గ్రాస్ 54 కోట్లకు చేరింది. బాలయ్య కెరీర్ లో ఇదే అత్యధికం. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో… అత్యధిక వసూళ్లు చేసిన 15వ సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. ఈ నేపథ్యంలోనే పుష్ప రికార్డును బ్రేక్ చేసింది వీర సింహారెడ్డి సినిమా.

వీర సింహారెడ్డి విడుదలైన తొలి రోజు అంటే గురువారం రోజున రూ. 25.36 కోట్లు రాగా, పుష్ప సినిమాకు 24 కోట్లు మాత్రమే వచ్చాయి. అయితే, మొదటి రోజు పర్వాలదేనిపించిన వీర సింహారెడ్డి.. రెండో రోజు నుంచి డీలా పడిందట. 13న రిలీజ్‌ వాల్తేరు వీరయ్య సినిమా కారణంగా 70 శాతం భాక్సాఫిస్‌ వసూళ్లు పడిపోయాయట. చాలా మంది వాల్తేరు వీరయ్య సినిమాకే వెళుతున్నట్లు సమాచారం. ఇక అటు ఒక్క రోజే వాల్తేరు వీరయ్య సినిమా రూ.57 కోట్లు వసూలు చేసిందని టాక్‌ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news