SSMB28 నుంచి అదిరిపోయే అప్డేట్..మహేష్ రచ్చ షురూ

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి.

ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌… ఇవాళ ప్రారంభం కానుందట. అధికారికంగా ప్రకటన చేసింది. దీంతో సోషల్‌ మీడియా మహేష్ ఫ్యాన్స్ రచ్చ మొదలైంది. కాగా… వచ్చే ఏడాది అంటే ఏప్రిల్‌ 28 వ తేదీన థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news