నాని సినిమా లో విల‌న్ గా స్టార్ హీరోయిన్ ?

-

నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డొన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్ లుగా వ‌స్తున్న సినిమా శ్యామ్ సింగ‌రాయ్. అయితే ఈ సినిమా కు సంబంధించిన ఒక వార్త సోష‌ల్ మీడియా లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అది ఎంటి అంటే ఈ సినిమా లో నాని కి విల‌న్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి ప‌ల్లవి న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియా తో పాటు సినీ ప‌రిశ్ర‌మ లో కూడా చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ వార్త విన‌డానికి కాస్త వింత గా ఉన్న ఈ వార్త నే నిజం అని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా లో సాయి ప‌ల్ల‌వి పూర్తి స్థాయి లో ప్ర‌తి నాయకురాలి గా ఉంటుందా.. లేదా కొంత భాగం లో విల‌నీజాన్ని చూపిస్తుందా అని తెలియాల్సి ఉంది. అయితే గ‌తంలో ఎంసీఏ అనే సినిమా లో సాయి ప‌ల్ల‌వి హీరో నాని తో న‌టించింది. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ లో న‌టిస్తుంది. కాగ ఈ సినిమా కు రూ. 40 కోట్ల బ‌డ్జెట్ ను కేటాయించారు. దీంతో నేచుర‌ల్ స్టార్ నాని సినిమా చ‌రిత్ర‌లో ఎక్కువ బ‌డ్జెట్ తో వ‌స్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్.

Read more RELATED
Recommended to you

Latest news