రేపు సాయంత్రం 5 గం.లకు సూపర్ స్టార్ సర్‌ప్రజ్ ..డైరెక్ట్ గా ఫ్యాన్స్ తో ..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత మహేష్ నుండి మళ్ళీ సినిమా రాలేదు. మహర్షి సినిమాతో సూపర్ స్టార్ కి హిట్ ఇచ్చిన వంశీపైడిపల్లి తో మళ్ళీ సినిమా చేస్తాడని అనుకున్నారు. కాని ఆ సినిమా ట్రాక్ మీదకి రాలేదు. ఈ లోపు లాక్‌డౌన్ వచ్చింది. అయినా అందరు హీరోలు ఏదో ఒక సినిమా రిలీజ్ కో లేక షూటింగ్ తో సెట్స్ మీదనో ఉన్నాయి.

 

కాని మహేష్ ఒక్కడే ఖాళీగా ఉన్నాడు. దాంతో మహేష్ నుండి ఎప్పుడు గుడ్ న్యూస్ వస్తుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు ఫలించాయి. రేపు మహేష్ కొత్త సినిమా న్యూస్ వస్తోంది. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు కొత్త సినిమాని ప్రకటించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకి సర్కారు వారి పాట అన్న టైటిల్ పరిశీలనలో ఉంది.

అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు రేపు సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్ గా ఫ్యాన్స్ తో ముచ్చటించబోతున్నారు. దీనికి సంబంధించి న్యూస్ ఇప్పటికే వచ్చేసింది. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకి సూపర్ స్టార్ సరదాగా సమాధానం చెప్తారట. ఇది నిజంగా ఫ్యాన్స్ కి పెద్ద సర్‌ప్రజే అని చెప్పాలి. సో ఫ్యాన్స్ బి రెడీ. ఎవరికి ఎలాంటి సందేహాలున్నాయి..సూపర్ స్టార్ ని ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ లో చూడాలనుకుంటున్నారు ..ఏ డైరెక్టర్ తో పని చేయాలనుకుంటున్నారు ..ఇలా ప్రశ్నల చిట్టాని సిద్దం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news