ఆర్జివికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్..!

-

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఏపిలో రిలీజ్ కు అడ్డంకులు తెలిసిందే. ఏపి హై కోర్ట్ ఏప్రిల్ 3న లాయర్లకు స్పెషల్ షో వేసిన తర్వాత వచ్చిన తీర్పుని బట్టి ఏప్రిల్ 15న రిలీజ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఈలోగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి సుప్రీం కోర్ట్ కు వెళ్లారు. సుప్రీం కోర్ట్ ఈ పిటీషన్ ను తోసిపుచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టలేమని కోర్ట్ తెలిపిందట.

హై కోర్ట్ న్యాయమూర్తులు చూసేంతవరకు ఆగలేకపోతున్నారా అంటూ రాకేష్ రెడ్డిపై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసిందట. రాకేష్ రెడ్డి తరపున సుధార్ రెడ్డి సుప్రీం లో పిటీషన్ వేశారు. అయితే అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది మరొకటి.. ఏప్రిల్ 3 తర్వాత నిర్ణయం తెలిపాక సుప్రీం పిటీషన్ వేసుకోవచ్చని చెప్పారట. ఈనెల 11న ఏపిలో ఎలక్షన్స్.. చూస్తుంటే ఏపిలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఎన్నికల తర్వాతే రిలీజ్ అయ్యే పరిస్థితులు కబడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version