ఆది పురుష్ మూవీలో హనుమంతుడి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరో..!

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఆది పురుష్ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఈనెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీవలే తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా అద్భుతంగా పూర్తి చేశారు. లక్షల మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి.. ప్రభాస్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రం హోల్సేల్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ టి సిరీస్ నుంచి 180 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం గమనార్హం.

ఎప్పుడైతే ఈ సినిమాని ఆ సంస్థ కొనుగోలు చేసిందో అప్పటినుంచి సినిమాకి మహర్దశ పట్టుకుందనే చెప్పాలి. ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా గురించి రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉండడం గమనార్హం ఇక ఈ సినిమాలో ప్రముఖ మలయాళీ నటుడు దేవదత్త హనుమంతుడి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ట్రైలర్లో ఆయన లుక్ చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వచ్చారా అన్నట్లుగా అనిపిస్తుంది. అంత సహజంగా ఈ సినిమాలో తన నటనతో కట్టిపడేశారు దేవదత్త. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా దేవదత్త గురించి ప్రభాస్ ప్రత్యేకంగా మాట్లాడారు.

ఇకపోతే ఈ దేవదత్త పాత్రను చాలామంది హీరోలు మిస్ చేసుకున్నట్లు సమాచారం. అందులో దగ్గుబాటి రానా కూడా ఒకరు అని తెలుస్తోంది. ఎందుకంటే ఈయన శరీర సౌష్ఠవం, ముఖ వర్చస్సు ఇలా అన్నీ కూడా ఆంజనేయ స్వామి పాత్ర చేయడానికి సరిగ్గా సరిపోతాయి అందుకే రానా ను సంప్రదించగా కానీ అప్పటికే సర్జరీ చేయించుకుని ఉన్నారు రానా. డాక్టర్లు ఏడాది పాటు షూటింగ్లో పాల్గొనకూడదని చాలా స్ట్రిక్ట్ గా చెప్పారట అందుకే ఈ పాత్రను మిస్ చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news