నయనతారకు షాక్.. ‘కనెక్ట్‌’ రిలీజ్ కు ముందుకు రాని థియేటర్ యజమానులు..?

-

నయనతారకు గట్టి షాక్ తగిలింది. ఈ లేడీ సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో నటించిన హారర్‌ మూవీ ‘కనెక్ట్‌’. అశ్విన్‌ శరవణన్‌ దర్శకుడు. డిసెంబర్‌ 22న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, తాజాగా సమాచారం ప్రకారం.. ‘కనెక్ట్‌’కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

అసలు విరామమే లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు తమిళనాడులోని థియేటర్‌ యజమానులు ఆసక్తి కనబర్చడం లేదని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంటర్వెల్‌ సమయంలో అమ్మే పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్స్‌, ఇతర చిరుతిళ్ల వల్ల తమకు ఎంతోకొంత డబ్బు వస్తోందని, అలాంటిది విరామమే లేకుండా సినిమా వేస్తే.. తమ ఆదాయానికి గండిపడుతోందని వాళ్లు అనుకుంటున్నారని, ఈ విషయంపైనే చిత్ర నిర్మాతలతోనూ చర్చిస్తున్నారని కోలీవుడ్‌ కోడై కూస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news