బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇదే..!!

-

టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ హీరోగా నటిస్తూనే పలు విజయాలను అందుకుంటున్నారు. బాలకృష్ణ కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో ఆదిత్య 369 సినిమా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ సినిమా అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ సినిమా సీక్వెల్ పై ప్లానింగ్ ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే చివరకు ఎట్టకేలకు బాలయ్య స్వయంగా ఈ సినిమా కోసం కథ రాసుకున్నట్లుగా తెలియజేశారు.

ఆదిత్య 369 సీక్వెల్ సినిమాని.. ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ని కూడా తెలియజేయడం జరిగింది. ఈ సినిమా తో తన కుమారుడు మోక్షజ్ఞను ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నందమూరి ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి మరొక నట వారసుడు ఎంట్రీ ఇచ్చినట్టే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి కావస్తోందని బాలకృష్ణ సన్నిహితుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక మోక్షజ్ఞ ఎంట్రీకి ఇదే సరైన సమయం అన్నట్లుగా బాలయ్య భావించడమే కాకుండా.. మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించే విధంగా ప్లాన్ చేస్తున్నారట బాలకృష్ణ. ఇప్పటికే ఎన్నోసార్లు మోక్షజ్ఞ ఎంట్రీ పై పలు రకాలుగా వార్తలు వచ్చాయి.. అవన్నీ నిజం కాలేదు.. మరి ఆదిత్య 999 మ్యాక్స్ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కచ్చితంగా చెబుతున్నారు. ఈ సినిమాని సొంతంగా బాలకృష్ణ నే తెరకెక్కిస్తూ ఉన్నారని సమాచారం. మరి ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలుబడుతుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news