అనుష్కపై టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి షాకింగ్ కామెంట్స్ !

-

అనుష్కపై టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ కు జంటగా కృతి నటించిన ఉప్పెన సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది ఈ భామ. ఈ విజయంతో ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

 

అయితే.. “బాహుబలి” సినిమాలో అనుష్క తరహాలో పాత్రలు చేయడం తన డ్రీమ్ రోల్ అని హీరోయిన్ కృతి శెట్టి అన్నారు. యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమాలు చేయాలని ఉందని తెలిపారు. జయాపజయాల గురించి తాను పట్టించుకోనని మీడియా సమావేశంలో చెప్పారు. శర్వానంద్ కు జోడిగా నటించిన “మనమే” సినిమాలో తన పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందన్నారు. కాగా “మనమే” మూవీ ఈనెల 7న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news