హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల‌పై టాలీవుడ్ క‌దిలింది!

-

 

దివి‌సీమ ఉప్పెన నుంచి నిన్న‌టి కేర‌ళ వ‌ర‌‌ద బాధితుల వ‌ర‌కు టాలీవుడ్ స్టార్స్ త‌మ వంతు స‌హాయాన్ని అందించి అం‌డ‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి త‌మ గొప్ప‌మ‌న‌సుని టాలీవుడ్ స్టార్స్ చాటుకుంటున్నారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం ఒక్క‌సారిగా ఉళిక్కిప‌డింది. ఎన్న‌డూ లేని విధంగా వ‌ర‌ద‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. వీధుల‌న్నీ చెరువుల్ని.. నాళాల్ని త‌ల‌పించాయి.

ఈ నేప‌థ్యంలో ముమున్నామంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ స‌హ‌యంగా 550 కోట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తెలంగాణ ప్ర‌భుత్వానికి అండ‌గా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ 15 కోట్లు స‌హాయం ప్ర‌క‌టించారు. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి సైతం 10 కోట్లు విరాళం అంద‌జేశారు. టాలీవుడ్ స్టార్స్ కూడా త‌మ వంతు స‌హాయాన్ని ప్ర‌క‌టించ‌డం మొద‌లుపెట్టారు.

మెగాస్టార్ కోటి, మ‌హేష్‌బాబు కోటి ప్ర‌క‌టించ‌గా నాగార్జున 50 ల‌క్ష‌లు, ఎన్టీఆర్ 50 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు.
హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ 10 ల‌క్ష‌లు ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా వెంట‌నే సీఎం స‌హ‌య‌నిధికి ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేశారు. ద‌ర్శ‌కుడు హ‌రీష్‌శంక‌ర్ 5 ల‌క్ష‌లు, బండ్ల గ‌ణేష్ 5 ల‌క్ష‌లు, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి 5 ల‌క్ష‌లు మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా 10 కోట్లు సీఎం స‌హాయ‌నిధికి విరాళం ప్ర‌క‌టించారు. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్, నిర్మాత రాధాకృష్ణ చెరో 10 ల‌క్ష‌లు, హీరో రామ్ 25 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. వీరితో పాటు మ‌రి కొంత మంది స్టార్స్ కూడా విరాళం ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news