రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి వైభవి దుర్మరణం

-

ప్రముఖ బుల్లితెర నటి, హిందీ సీరియల్ సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌ ఫేం వైభవీ ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం జరిగిన ఓ కారు ప్రమాదంలో ఈ 32 ఏళ్ల నటి తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్​ సినీ, టెలివిజన్​ ఇండస్ట్రీ షాక్​కు గురైంది. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్​ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగా మంబయిలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయంటూ కుటుంబసభ్యులు తెలిపారు.

ఓ ప్రముఖ వార్తా పత్రిక ఇచ్చిన సమచారం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం హిమాచల్ ప్రదేశ్‌లో వైభవీ తనకు కాబోయే భర్తతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు మలుపుతిప్పుతున్న టైమ్​లో అడుపుతప్పి కారు బోల్తా కొట్టింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం మరింత తెలియాల్సి ఉంది. అభిమానులతో పాటు బుల్లితెర నటీనటులు ఆమెకు నివాళులు అర్పిస్తూ.. వైభవీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news