శృతి మించిన ఉమైర్ సంధు.. బన్నీ, రష్మిక రిలేషన్ పై కామెంట్స్..!

-

ప్రముఖ ఫిలిం క్రిటిక్ అని చెప్పుకునే ఉమైర్ సందు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ సినీ సెలబ్రిటీలను ఎప్పటికప్పుడు తప్పుదోవ పట్టిస్తూ వారిపై అభిమానులలో చెడు దృష్టి పడేలా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా సినిమాలకు రివ్యూలు ఇవ్వడమే కాదు నటీనటుల మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు సృష్టిస్తూ అందరిచేత చివాట్లు పడుతూ ఉంటాడు. అయితే ఇతడు ఇంతలా వారిని అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నప్పటికీ ఏ ఒక్క సెలబ్రిటీ కూడా ఇతడిపై ఘాటుగా స్పందించిన దాఖలాలు లేవు.

హీరో హీరోయిన్లు కాస్త చనువుగా కనిపించారంటే చాలు వారి మధ్య ఎఫైర్ నడుస్తోందని పెళ్లి చేసుకుంటారు. అంటూ ట్వీట్లు చేస్తూ వివాదాలకు తెర లేపుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తూ రకరకాల ట్వీట్లు చేసి వైరల్ అయిన ఈయన.. తాజాగా అల్లు అర్జున్, రష్మిక లను టార్గెట్ చేశాడు. తాజాగా వీరిని ఉద్దేశించి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అల్లు అర్జున్ , రష్మిక మందన్న ఒక ప్రైవేటు ప్లేన్ లో టైం స్పెండ్ చేస్తున్నారు. బన్నీ వైఫ్ కి ఈ విషయం తెలిసిన ఆమె పట్టించుకోదు అంటూ తన ట్వీట్ లో రాసుకు వచ్చారు.

అయితే ఇందులో రష్మిక, అల్లు అర్జున్ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ కూడా ఫోటోలో కనిపించడం గమనార్హం. దీంతో తాజాగా ఉమైర్ సందు చేసిన ట్వీట్ కి అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు రష్మిక మందన్న అభిమానులు ఉమైర్ సంధుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కొన్ని కొన్ని సార్లు అతను పెట్టే ట్వీట్లు చూస్తే అది ట్విట్టర్ అకౌంటా లేకపోతే టాయిలెట్ కమోడా అనేంతలా అరాచకంగా ట్వీట్ చేస్తూ ఉంటాడు. ఏది ఏమైనా ఉమైర్ ఇప్పుడు చేసిన ట్వీట్ కి ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news