‘వారసత్వాన్ని కొనసాగించడానికి బిడ్డను కనటం లేదు..’ ఉపాసన

-

వారసత్వాన్ని: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా సోషల్ మీడియా వేదికగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోను పంచుకున్నారు.ఈ సందర్భంగా తాను వారసత్వాన్ని కొనసాగించడానికి బిడ్డను కలవడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దాదాపు 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే తాజాగా వీరిద్దరూ పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్న విషయాన్ని తెలిపి మెగా అభిమానులకు గుడ్ న్యూస్ ఇచ్చారనే చెప్పాలి. ఈ వార్తతో ఇటు మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు సైతం రామ్ చరణ్ కి పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ కి పుట్టే బిడ్డ కాబోయే హీరో అంటూ ఫిక్స్ అయిపోయారు. రామ్ చరణ్ కు మగ బిడ్డ పుడితే మెగా ఫాన్స్ కచ్చితంగా హీరో అవుతాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ముందే ఊహించిన ఉపాసన తాజాగా సోషల్ మీడియా వేదికగా తన మనసులో అభిప్రాయాన్ని తెలిపారు.

Mother's Day Exclusive | 'Ram Charan and I decided to freeze eggs early ...

“సరైన సమయంలో నేను మాతృత్వాన్ని స్వీకరించినందుకు గర్వపడుతున్నాను. సమాజం కోసం లేదా మా వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతో లేదా నా వివాహాన్ని బలోపేతం చేయాలనే కోరికతో.. నేను నా బిడ్డకు జన్మని ఇవ్వాలని అనుకోలేదు. నా బిడ్డకు ప్రేమ, సంరక్షణను అందించడానికి నేను మానసికంగా సిద్ధమైనప్పుడే జన్మనివ్వాలని నిర్ణయించుకున్నా” అంటూ ఉపాసన రాసుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news