టెంపర్ క్లైమాక్స్ విని ఒక్కసారిగా పూరి జగన్నాథ్ రియాక్షన్ చూసి షాక్ అయ్యా.. వక్కంతం వంశీ

-

దర్శకుడు వక్కంతం వంశీ తాజాగా ఆలీతో సరదాగా షోకు గెస్ట్ గా విచ్చేశారు.. ఈ ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చిన ఆయన.. టెంపర్ సినిమాకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పనిచేయటం ఎప్పటికీ మర్చిపోలేనిదని.. అలాగే ఆ సినిమా కథ విని పూరి ఇచ్చిన రియాక్షన్ ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పకు వచ్చారు..

రైటర్ గా, దర్శకుడుగా ప్రత్యేక పేరు సంపాదించుకున్నారు వక్కంతం వంశీ.. అయితే ఈయన తన కెరియర్ స్టార్టింగ్ లో సురేందర్ రెడ్డి సినిమాలకు కథలు అందించేవారు.. అలాగే హీరోగా కూడా ఓ చిత్రంలో నటించారు.. ఆ తర్వాత దర్శకత్వం మీద ఆసక్తితో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకొని ఇటువైపు అడుగులు వేశారు.. అయితే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా వచ్చిన వంశీ పల ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు..

“టెంపర్ చిత్రం కోసం మొదటగా నేను ఎన్టీఆర్ గారికి చెప్పాను ఆయన పూరి గారికి కదా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అయితే ఆయనకు కథ చెప్పాలి అంటే నాకు కొంచెం భయమేసింది.. ఆ సమయంలో పూరి గారికి నాకు మధ్య క్లైమాక్స్ విషయంలో జరిగిన డిస్కషన్ నాకెందుకు నచ్చలేదు.. క్లైమాక్స్ నాకు నచ్చలేదని ఆయనకు డైరెక్ట్ గా చెప్పలేకపోయా. నాకు ఒక గంట సమయం ఇవ్వండి అంటూ మళ్ళీ వచ్చి ఆయనకు క్లైమాక్స్ చెప్పగా.. ఒక్కసారిగా లేచి నన్ను హగ్ చేసుకున్నారు అలాగే ఎంతో ఆనందం వ్యక్తం చేశారు నాకు ఆకలిగా లేదు నువ్వు చెప్పిన స్టోరీ తోనే నా కడుపు నిండిపోయింది అన్నారు ఈ అనుభవం నా జీవితంలో మర్చిపోలేనిది..” అంటూ చెప్పకు వచ్చారు వంశీ..

Read more RELATED
Recommended to you

Latest news