అందుకే విలన్ పాత్రలు చేస్తా – వరలక్ష్మి శరత్‌ కుమార్‌

-

ఇండస్ట్రీలోకి మొదట హీరోయిన్ గా నటించి అంతగా మెప్పించలేకపోయిన ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఈమెను జయమ్మ అంటే ప్రేక్షకులు టక్కున గుర్తుపడతారు. క్రాక్ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో సినిమాలలో కీలకమైన పాత్రలో నటించి మెప్పించింది.

అయితే, తాజాగా తన పాత్రలపై వరలక్ష్మి ఆసక్తికర మైన వ్యాఖ్యలు చేసింది. తనకు గ్లామర్ పాత్రలు వర్కౌట్ కాదని కెరీర్ మొదట్లోనే భావించాలని వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపింది. ఆ క్యారెక్టర్లు చేయడానికి చాలామంది ఉన్నారని పేర్కొంది. అందుకే విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తున్నానని చెప్పింది. లేడీ విలన్ గా నటిస్తూ సంతోషంగానే ఉన్నానంది. ఇటీవల యశోద చిత్రంలో ప్రతినాయిక పాత్రలో అలరించిన ఈమె, ప్రస్తుతం వీర సింహారెడ్డి లో బాలకృష్ణతో పోటీ పడబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news