BREAKING : ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ

-

BREAKING : ఈడీ విచారణకు టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. కాసేపటి క్రితమే, హైదరాబాద్‌ లోని ఈడీ విచారణకు టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు.

లైగర్‌ సినిమా పెట్టుబడులు, అతని రెమ్యూనరేషన్‌, ఈ సినిమాకు ఎవరు పెట్టుబడులు పెట్టారనే దానిపై ప్రశ్నించేందుకు .. హీరో విజయ్ దేవరకొండకు ఇటీవల ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హీరో విజయ్ దేవరకొండ.. ఈడీ విచారణకు హాజరయ్యాడు.

కాగా, లైగర్‌ చిత్ర నిర్మాతలుగా ఛార్మి, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మాత్రమే వ్యవహరించినట్టు బయటకు చెబుతున్నా.. దీని వెనుక చాలామంది ఉన్నారని… విదేశీ పెట్టుబడులు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాధ్, నిర్మాత ఛార్మిను ఈడి విచారించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news