లేడీ అమితాబ్, మేకప్ వేసి 13 ఏళ్ళు అయినా…!

-

13 ఏళ్ళ తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని అభిమానులు తెర మీద చూసారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమె నటిస్తుంది అనగానే ఆమె అభిమానులు ఎప్పుడు ఎప్పుడు సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసారు. సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అనేది అందరికి ఆసక్తి. ప్రధానంగా ఆమె నటన అలాగే ఉంటుందా…? క్యారెక్టర్ నటిగా ఏ విధంగా లేడీ అమితాబ్ ని తెర మీద చూస్తామని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు.

ముఖ్యంగా ఆమెకు మహిళల్లో అభిమానులు ఎక్కువ. దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఆమె వెండి తెర మీద కనపడటంతో ఆమె అభిమానులకు పండగలా ఉంది. శనివారం విడుదలైన ఈ సినిమాలో విజయశాంతి పాత్ర కోసం అనీల్ రావిపూడి బాగానే కష్టపడ్డారు. ఆ పాత్రకు ఆమె మినహా ఎవరూ సెట్ అవ్వరు అనే స్థాయిలో నటించారు విజయశాంతి. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ భారతిగా విజయశాంతి ఓ పవర్‌ఫుల్ నటించారు.

ప్రకాశ్‌రాజ్‌కు సవాలు విసిరే సన్నివేశాల్లో ఆమె నటనకు ఫిదా అయిపోయారు అభిమానులు. అదే విధంగా ఆర్మీ గొప్పదనం గురించి విజయశాంతి, మహేష్ మధ్య జరిగే సంభాషణ, సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే ఏ పాత్రకు అయినా నేను రెడీ అన్నట్టు ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటనకు ఆకట్టుకుంది. ఎమోషనల్ డైలాగులు ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించాయి. మేకప్ వేసి 13 ఏళ్ళు అయినా సరే ఎక్కడా కూడా వన్నె తగ్గలేదు.

Read more RELATED
Recommended to you

Latest news