ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ పై నమ్రత ఏమన్నారంటే..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నమ్రత.. ఘట్టమనేని కోడలిగా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. మహేష్ బాబు ను వివాహం చేసుకోక ముందు ఆమె బాలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇకపోతే వంశీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నమ్రత , మహేష్ బాబు సరసన నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి ఇద్దరికీ పరిచయం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారింది. ఒక రెండు , మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరు ముంబైలో వివాహం చేసుకున్నారు.Namrata Shirodkar Birthday: Mahesh Babu revealed his crush for former Miss India pictures latest celeb news | Celebrities News – India TVఇక సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. కానీ వారు కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్న విషయం కూడా తెలిసిందే. ఇటీవల నమ్రత రీ ఎంట్రీ పై కూడా అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు . ఈ క్రమంలోనే ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన నమ్రత తన రీ ఎంట్రీ పై స్పందించడం జరిగింది. ఇక నమ్రత మీడియాతో మాట్లాడుతూ నా అభిమానులందరినీ హర్ట్ చేస్తున్నందుకు క్షమించాలి. నాకు కూడా అభిమానులను ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరంగా ఉంది.Namrata Shirodkar wishes hubby Mahesh Babu on 17th anniversary, reveals secret of their marriage - Movies Newsకానీ వివాహం అనంతరం కుటుంబ బాధ్యతలను మోస్తూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ.. వారి చదువుల విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహిస్తున్నాను. ఇక మహేష్ కి సంబంధించిన పలు వ్యాపారాలలో కూడా నేను భాగస్వామిని అయ్యాను. ఇన్ని బిజీ పనుల మధ్య నేను సినిమాలలో రీఎంట్రీ ఇవ్వలేను. కాబట్టి సినిమాలలోకి మళ్ళీ వచ్చే అవకాశమే లేదు. ఒక గృహిణిగా మంచి సంతృప్తి నాకు కలిగింది . ఇక ఇంతే చాలు అంటూ చెప్పడం తో అభిమానులు మాత్రం ఒకింత నిరాశ వ్యక్తం చేశారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news