అవును మహేష్ బాబు చెప్పింది నిజమే: కంగనా రనౌత్

-

‘సర్కారు వారి పాట ‘ సినిమా ప్రచారంలో ఇటీవల హీరో మహేష్ బాబు మాట్లాడుతూ బాలీవుడ్ తనను భరించలేదు అని చెప్పిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు బాలీవుడ్ లోనూ చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ విషయంపై హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించింది. కంగనా నటించిన చిత్రం”ధాకడ్” ప్రచార కార్యక్రమంలో భాగంగా కంగనా మాట్లాడుతూ.. మహేష్ బాబు అన్నది నిజమేనని, ఆయనను బాలీవుడ్ భరించలేదని చెప్పింది. ఎందుకంటే ఆయనను బాలీవుడ్ నుంచి ఎంతోమంది సినిమా కోసం సంప్రదించారని తనకు తెలుసు అని చెప్పింది.

అయినప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ దేశంలోనే నెంబర్ 1 ఇండస్ట్రీ గా నిలిచిందని, దీంతో మహేష్ బాబు కు తగ్గ రెమ్యునరేషన్ బాలీవుడ్ కచ్చితంగా ఇవ్వలేదని చెప్పింది. మహేష్ చేసిన వ్యాఖ్యలను పట్టుకుని చిన్న చిన్న విషయాలను ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని పేర్కొంది. టాలీవుడ్ పైన తన పని పైన మహేష్ బాబు గౌరవం ఇవ్వడం వల్లనే ఆయన ఈ స్థాయిలో ఉండవు ఎదిగాడని తెలిపింది. ఆ విషయాన్ని అందరూ అంగీకరించారు అని చెప్పింది. టాలీవుడ్ గత పది, పదిహేను ఏళ్లలో తమిళ సినీ పరిశ్రమతో పాటు ఇతర ఇండస్ట్రీలో అన్నింటిని అధిగమించి ఉందని చెప్పింది. టాలీవుడ్ ని చూసి చాలా నేర్చుకోవాలని తెలిపింది కంగనా రనౌత్.

Read more RELATED
Recommended to you

Latest news